ఆర్టీసీ బస్సు- కారు ఢీ.. ఇద్దరి మృతి | 2 killed in rtc bus accident at chittoor district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు- కారు ఢీ.. ఇద్దరి మృతి

Apr 9 2016 12:41 PM | Updated on Sep 3 2017 9:33 PM

బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.

చంద్రగిరి: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పాకాలవారిపల్లి వద్ద శనివారం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడుకు చెందిన కుటుంబం కారులో తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను తిరుపతి రియా ఆస్పత్రికి తరలించగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement