ఉట్నూర్ ఐటీడీఏ ఈఈ ఇంటిపై దాడులు | Sakshi
Sakshi News home page

ఉట్నూర్ ఐటీడీఏ ఈఈ ఇంటిపై దాడులు

Published Fri, Jan 12 2018 11:59 AM

acb rides on utnoor ITDA EE ramesh houses

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఈఈ రమేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిఘా పెట్టిన ఏసీబీ శుక్రవారం తనిఖీలు చేపట్టింది.  

హైదరాబాద్, వరంగల్‌, ఉట్నూరు సహా 8 చోట్ల అవినీతి నిరోధక శాఖ ఏకకాలంలో సోదాలు జరుపుతోంది. రమేశ్ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, గడిచిన రెండేళ్లుగా రమేష్‌ ఐటీడీఏ ఈఈగా పని చేస్తున్నారు. గతంలోనూ ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి.
 

Advertisement
Advertisement