బంగ్లాదేశ్‌పై 17 పరుగులతో గెలుపు | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌పై 17 పరుగులతో గెలుపు

Published Thu, Mar 15 2018 7:51 AM

టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించి జట్టుకు పోరాడే స్కోరు అందించారు. బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. దాంతో నిదహస్‌ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నమెంట్‌లో భారత్‌ రాజసంగా ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఇక్కడ జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో రోహిత్‌ సేన 17 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.