వైఎస్సార్సీపీ ఏ పార్టీతో పొత్తుపెట్టుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు. సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా తమకు బీజేపీ, కాంగ్రెస్, కేసీఆర్తో పొత్తులేదని, ఆ అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. సింహం సింగిల్గానే వస్తుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సింగిల్గానే ఎన్నికలకు వెళుతున్నట్టు పేర్కొన్నారు.