జిల్లాలోని పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లలో ఆదివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆస్తులపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఆక్రమణల తొలగింపు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెందిన ఐదు ఇళ్లను కూల్చి వేశారు.