ఇలాంటి సీఎంను ఎప్పుడైనా చూశామా? | YS Jagan Speech At Guntur Public Meeting | Sakshi
Sakshi News home page

ఇలాంటి సీఎంను ఎప్పుడైనా చూశామా?

Apr 5 2019 6:05 PM | Updated on Mar 20 2024 5:06 PM

పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ కానుక ప్రకటించారు. పేదవారు మొదలుకొని ఏడాదికి రూ. 5లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కొత్తగా యూనివర్సల్‌ హెల్త్‌ కార్డులు తీసుకువస్తానని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. అంటే నెలకు రూ. 40 వేల వరకు జీతం ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు చేయిస్తామని తెలిపారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే చాలు వాళ్లందరిని యూనివర్సల్‌ హల్త్‌ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీలోకి తీసుకువస్తామన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో తానే ఈ పథకాన్ని దగ్గరి ఉండి పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. గుంటూరులో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. 

Advertisement
 
Advertisement
Advertisement