ఆస్పత్రిలో ఘోరం.. పెద్ద సంఖ్యలో రోగుల మృతి | several dead in South Korea hospital blaze | Sakshi
Sakshi News home page

Jan 26 2018 11:25 AM | Updated on Mar 22 2024 11:22 AM

దక్షిణకొరియాలోని ఓ ఆస్పత్రిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో సుమారు 40 మంది రోగులు మృతిచెందారు. ప్రఖ్యాత మిర్యాంగ్‌ నగరంలోని సెజాంగ్‌ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చెలరేగిన మంటలు.. నిమిషాల్లోనే ఆరంతస్తుల భవనాన్ని బూడిద చేశాయి. ‘‘ఈ ఘటనలో 40 మంది చనిపోగా, మరో 60 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది’ అని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో సుమారు 200 మంది రోగులు ఆస్పత్రిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement