రాష్ట్రంలో కొత్త జిల్లాలపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. స్థానిక అవసరాలు, ప్రజల డిమాండ్లు, నేతల ఒత్తిళ్ల కారణంగా 31 జిల్లాలు ఏర్పాటు చేసినా.. పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని నిర్ధారణకు వచ్చింది. అలా అదనంగా ఏర్పాటు చేసిన జిల్లాలను చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో విలీనం చేయాలని యోచిస్తోంది. ఇదే సమయంలో సమర్థవంతమైన పాలన అందించేందుకు అవసరమైన కొత్త జిల్లాలను మాత్రం యథాతథంగా కొనసాగించాలని భావిస్తోంది. ప్రధానంగా వరంగల్ రూరల్ జిల్లాను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా అధికారులతో చర్చించినట్లు సమాచారం. త్వరలోనే ఈ జిల్లాకు మంగళం పాడే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచనప్రాయంగా అంగీకరిస్తున్నాయి.
కొత్త జిల్లాలపై ప్రభుత్వం పునరాలోచన
Dec 29 2017 11:43 AM | Updated on Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement