హైదరాబాద్‌లో పర్యటించనున్న ఇరాన్ ప్రసిడెంట్ | Iranian president to begin his India visit from Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పర్యటించనున్న ఇరాన్ ప్రసిడెంట్

Feb 15 2018 8:04 AM | Updated on Mar 22 2024 11:25 AM

ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఇరాన్‌ అధ్యక్షుడు డా.హసన్‌ రౌహనీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురు, శుక్రవారాల్లో(15, 16 తేదీల్లో) రౌహనీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎస్‌ సమావేశం నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయంలో కస్టమ్స్‌ మరియు ఇమిగ్రేషన్‌ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎస్‌ జోషి ఆదేశించారు. రౌహనీకి బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి ఆర్పీ సింగ్‌ స్వాగతం పలుకుతారని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.  

Advertisement
 
Advertisement

పోల్

Advertisement