నిప్పునంటూ బాబు డబ్బాలు కొట్టుకున్నారు | Gopireddy Srinivas Reddy Fires On Chandrababu Corruption | Sakshi
Sakshi News home page

నిప్పునంటూ బాబు డబ్బాలు కొట్టుకున్నారు

Feb 14 2020 5:37 PM | Updated on Mar 22 2024 11:10 AM

నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నిజాయితీపరుడయితే ఐటీ కేసుపై విచారణ ఎదుర్కోవాలని సవాలు విసిరారు. అవినీతి, అక్రమాలకు పాల్పడటం కోర్టుల నుంచి స్టే తెచ్చుకోవటం చంద్రబాబుకు అలవాటేనని గుర్తుచేశారు. బయట మాత్రం నిప్పునంటూ చంద్రబాబు డబ్బాలు కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిపై ఆయనకు మద్దతు ఇస్తున్న సీపీఐ, సీపీఎం, పవన్‌ కల్యాణ్‌ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుపై విచారణ జరపాలని ఆ పార్టీలు కూడా డిమాండ్‌ చేయాలన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement