పాస్‌బుక్‌కు ఆధార్‌ | Aadhaar to link land passbook | Sakshi
Sakshi News home page

Feb 24 2018 8:11 AM | Updated on Mar 20 2024 1:58 PM

పట్టాదారు పాస్‌ పుస్తకానికి ఆధార్‌ నంబర్‌ను కచ్చితంగా అనుసంధానం చేయా లని రైతులకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. లేదంటే పాస్‌ పుస్తకాల్లోని భూములను బినామీ ఆస్తులుగా గుర్తించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. భూ రికార్డులకు ఆధార్‌ కార్డు లింక్‌ చేయడానికి కొంతమంది ముందుకు రావడం లేదని, ఇప్పటికైనా వారందరూ ఆధార్‌ నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘భూ రికార్డులను పక్కాగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేస్తున్నాం. మేడ్చల్, రంగారెడ్డితో పాటు కొన్ని జిల్లాల్లో కొందరు తమ ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేయించుకోలేదు. అలాంటి వారందరూ అధికారులకు ఆధార్‌ నంబర్‌ ఇవ్వాలి. 

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement