ప్రకాశం జిల్లా పరిషత్ వైఎస్ఆర్ సిపి కైవసం | ysrcp-wins-prakasham-zp-chairman | Sakshi
Sakshi News home page

May 13 2014 8:02 PM | Updated on Mar 21 2024 7:44 PM

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. జిల్లాలో మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్లో వెలువడిన తొలి జెడ్పీ చైర్మన్ ఫలితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి రావడం విశేషం. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తోంది. అత్యధిక ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెలిచింది. ఈ మూడు జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ పదవులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకునే దిశగా మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. ఇక గుంటూరు, కృష్ణా, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో టీడీపీతో హోరాహోరీగా సీట్లను గెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా అందాల్సివుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement