‘చంద్రబాబు ముమ్మాటికీ దళిత ద్రోహి' | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ముమ్మాటికీ దళిత ద్రోహి'

Published Mon, Apr 3 2017 7:17 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్‌ దళితులను మోసం చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళితులకు సబ్‌ప్లాన్‌ నిధులు ఖర్చు చేయడంలేదన్నారు. దళిత సంక్షేమం కోసం కృషి చేసిన ఏకైక వ్యక్తి వైఎస్‌ రాజశేఖరరెడ్డేనని, చంద్రబాబు మాత్రం దళిత ద్రోహిగా మిగిలిపోయారన్నారు.