ప్రజా సమస్యలపై ఇక అవసరమైతే ఉద్యమం చెయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. జేఏసీ భవిష్యత్ కార్యాచరణపై తాము సీరిస్గా చర్చించినట్లు తెలిపారు. భూసేకరణ 2013 చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోందని, దీనికి నిరసనగా ఈనెల 29న హైదరాబాద్లో ధర్నా చేస్తామన్నారు. విద్యాసంస్థల పరిరక్షణ, ఉపాధి, ఉద్యోగాలపై ఫిబ్రవరిలో హైదరాబాద్లో ర్యాలీలు, ధర్నా, అధ్యయన యాత్ర ఉంటాయని తెలిపారు. అలాగే మార్చి నెలలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలపై క్షేత్ర స్థాయిలో పరిశీలన ఉంటుందన్నారు. ఏప్రిల్ నెలలో కుల వృత్తులు, సూక్ష్మ పరిశ్రమలపై అధ్యయనం చేస్తామని తెలిపారు.
Dec 25 2016 7:31 PM | Updated on Mar 20 2024 5:21 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement