నిరుద్యోగుల నిరసన ర్యాలీ నేపథ్యంలో అరెస్టు చేసిన తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ను పోలీసులు విడుదల చేశారు. కామాటిపురా పోలీసు స్టేషన్లో ఉన్న ఆయనను రాత్రి 7 గంటల సమయంలో విడుదల చేసి, తార్నాక ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటికి తరలించారు. ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అందుకు నోటిఫికేషన్లను విడుదల చేయాలన్న డిమాండుతో నిరుద్యోగుల నిరసన ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించాలని కోదండరామ్ నేతృత్వంలోని జేఏసీ నిర్ణయించిన విషయం తెలిసిందే.