భారత దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన పీవీ నరసింహరావుకు తగిన గుర్తింపు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా యమున నది ఒడ్డున పీవీ మెమోరియల్ ఘాట్ ని నిర్మించాలని ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పీవీ మరణానికి ముందు నుంచే ఆయనకి సముచిత స్థానం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రధాన మంత్రి స్థాయికి చేరి, ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చి దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిది. ఏక్తా స్థల్ సమాధి కాంప్లెక్స్ సముదాయంలో పీవీ మెమోరియల్ ఘాట్ని నిర్మించడానికి మంత్రిమండలి అమోదం కోసం పట్టణ అభివృద్ధిమంత్రిత్వశాఖ గత వారం ఒక ప్రతిపాదన పంపింది.
Mar 31 2015 8:46 PM | Updated on Mar 21 2024 10:47 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement