వజ్రకరూర్‌లో చిరుత సంచారం | Sakshi
Sakshi News home page

వజ్రకరూర్‌లో చిరుత సంచారం

Published Sat, Sep 17 2016 9:22 AM

అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం గుల్యపాలెం గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా గ్రామంలో చిరుత సంచరిస్తోండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ అంశాన్ని అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.