కాంగ్రెస్, టీడీపీలు రాజీనామా డ్రామాలు: దాడి | Dadi veerabhadra rao speaks to media | Sakshi
Sakshi News home page

Aug 10 2013 3:12 PM | Updated on Mar 22 2024 11:19 AM

సీమాంధ్ర ఉద్యమంతో కాంగ్రెస్‌ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్‌, టీడీపీ నేతలు రాజీనామాలతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కూడా విభజన నిర్ణయాన్ని తప్పుబట్టారని విమర్శించారు. ఆంటోనీ హైలెవల్ కమిటీ కాంగ్రెస్ పార్టీ కమిటీ అని... ప్రభుత్వ కమిటీ కాదని దాడి వీరభద్రరావు అన్నారు. టీడీపీ ఎంపీల నటన కమల్‌ హాసన్‌ను మించిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement