తెలంగాణపై షిండేకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల లేఖ | Bhumana Press Meet 17th July 2013 | Sakshi
Sakshi News home page

Jul 17 2013 4:45 PM | Updated on Mar 22 2024 11:26 AM

తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తన సొంత వ్యవహారంగా చూస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కట్టబెట్టాలన్న కోర్ కమిటీ నిర్ణయం దిగ్భ్రాంతికి గురి చేస్తోందంటూ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఓ లేఖ రాశారు. తెలంగాణపై ఇటు కాంగ్రెస్ పార్టీ గానీ, కేంద్ర ప్రభుత్వంగానీ తమ వైఖరి ఏంటో చెప్పలేదని, వైఖరి తేల్చకుండానే ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజిస్తామంటే ఏ విధంగా సమంజమసని లేఖలో నిలదీశారు. ముందుగా కాంగ్రెస్, కేంద్రం తమ వైఖరి స్పష్టం చేసి అటుపై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని, తర్వాత మిగిలిన పార్టీ నేతలను కూడా ఆహ్వానించి విస్తృత చర్చ జరపాలని కోరారు. ఈ ప్రక్రియ ఏమీ జరగకుండానే.. చర్చలు ముగిశాయి, నిర్ణయమే తరువాయి అనడం నియంతృత్వమని దుమ్మెత్తి పోశారు. ఏక పక్ష నిర్ణయాలతో ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకూడదని, ఆచరణ సాధ్యమైన పద్ధతిలో అందరికీ ఆమోదమయ్యేలా సమస్య పరిష్కరించాలని కోరారు. తెలంగాణ అంశంలో కాంగ్రెస్ పార్టీ తన సొంత రాజకీయ లబ్ధి కోసం అడ్డుగోలుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement