ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం అయ్యారు. విజయవాడలోని A-కన్వెన్షన్ హాల్లో ఆయన రాష్ట్రానికి నీటి కేటాయింపులు, ప్రాథమిక రంగ మిషన్, సమగ్ర అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 2029 సంవత్సరం నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండాలనే ప్రణాళికతో ఉన్నామన్నారు.