మల్లేల చెరువు నుంచి నా పొలం వద్దకు దాదాపు 4కి.మీ మేర చీనీ చెట్లకు నీటితడులు అందించేందుకు పైపులైన్ వేశాను. దాదాపు 600లకుపైగా పైపులు అమర్చాను. దీంతో నాకు రూ.8లక్షల మేర నష్టం జరిగింది. నాకు నష్టపరిహారం అందించాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. నష్టపోయిన మాకు పరిహారం అందించకుండా ఏ నష్టం జరగని రైతులకు లక్షలు అధికారులు మంజూరు చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నా.
– గట్టు నాగయ్య, చీనీ రైతు, మల్లేల


