సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న గ్రేడ్–2 జేఎల్ఎంలు పనిభారంతో నలిగిపోతున్నారు. ఒకవైపు విద్యుత్ శాఖలో, మరోవైపు సచివాలయాల్లో పనిచేయాల్సి వస్తోంది. పనిఒత్తిడి తగ్గించాలి –సి.హరిప్రసాద్, డిస్కం
జాయింట్ సెక్రటరీ. ఓఅండ్ఎం యూనియన్
ప్రత్యేక పీఆర్సీ అమలు చేయాలి
విద్యుత్ శాఖలో పనిచేసే జేఎల్ఎంలు, లైన్మెన్లు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది 24 గంటలు పనిచే యాల్సి ఉంటుంది. వీరికి సెలవులు ఏమీ ఉండవు. అత్యవసర సమయాల్లో ఎప్పుడై నా పనిచేయాల్సి ఉంటుంది. కాలం మా రినా సైకిల్ అలవెన్సు మాత్రమే ఇ వ్వ డం దారుణం. ఓఅండ్ఎం సిబ్బందికి ప్ర త్యేక పీఆర్సీ ఇవ్వాలి. – సి. చంద్ర ఓబుల్రెడ్డి,
రీజనల్ సెక్రటరీ. ఓఅండ్ఎం యూనియన్
ప్రభుత్వాదేశాల మేరకు నడుచుకోవాల్సిందే
గ్రేడ్–2 జేఎల్ఎంలకు విద్యుత్ శాఖే జీతాలు ఇస్తోంది. వారు విద్యుత్ శాఖలోని పనులు చేయాలి. అలాగే వారు సచివాలయాల ద్వారా ఎంపిక అయ్యారు కాబట్టి ఆ శాఖ ద్వారా చెప్పిన సర్వే పనులను కూడా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం రోజుకు ఎన్ని కుటుంబాలను సర్వే చేయాలో చేసి, మిగిలిన సమయంలో విద్యుత్ శాఖ పనులు చేయాలి. – ఎస్. రమణ,
పర్యవేక్షక ఇంజినీర్, ఏపీఎస్పీడీసీఎల్


