ఎండిపోతున్న పంటలు
నెల రోజుల నుంచి తాగు, సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నాం. నీరు లేక అరటి పంట ఎండిపోతోంది. రోజు రోజుకు నీటిమట్టం తగ్గిపోతుండటం వల్ల రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారు కొత్తగా బోర్లు వేసుకుంటున్నారు. దీంతో ఖర్చు ఎక్కువగా అవుతోంది. మాకు ఎగువపల్లె సంప్ నుంచి నీరు విడుదల చేసి దిగువపల్లె మురారిచింతల, ఎగువపల్లె, కోమన్నూతల, లోపట్నూతల, తాతిరెడ్డిపల్లె రైతులను ఆదుకోవాలి. – శివ నారాయణరెడ్డి,
దిగువపల్లె గ్రామం, లింగాల మండలం


