ఇద్దరు కార్పొరేటర్ల రాజీనామా
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 12వ డివిజన్ కార్పొరేటర్ ఎస్. శివకోటిరెడ్డి, 13వ డివిజన్ కార్పొరేటర్ ఎం.రామలక్ష్మణ్రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం తపాలాలో రాజీనామా లేఖలను కార్పొరేషన్ కార్యాలయంలో అందజేశారు. శుక్రవారం ఉదయం సీఎంఓకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరితోపాటు పొలిట్బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాసులరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆ పార్టీ నాయకుడు వి.నాగేంద్రారెడ్డి ఉన్నారు.


