
పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం
రాయచోటి జగదాంబసెంటర్ : పొగాకు రహిత సమాజాన్ని నిర్మించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జాతీయ పొగాకు నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీవాణి కోరారు. గురువారం రాయచోటిలోని డైట్ కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ సిగరెట్టు, ఇతర పొగాకు సంబంధిత ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించారు. ప్రజలందరూ మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలని, పొగాకు, వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వారిచేత పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపల్ ఎం.నర్సింహారెడ్డి, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుమతి, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్రెడ్డి, అధ్యాపకులు శివభాస్కర్, వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రయోగాలు, తిరోగమన విధానాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం నుంచి పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాలను బహిష్కరిస్తున్నాం. పిల్లలకు హాజరు, ఉపాధ్యాయులకు హాజరు, పిల్లలకు బోధన తప్ప ఎలాంటి బోధనేతర కార్యక్రమాలను నిర్వహించం. ఈ విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే వారకు ఈ బహిష్కరణ కొనసాగుతుంది. – ఇలియాస్బాషా, ఫ్యాప్టో చైర్మన్. వైఎస్సార్జిల్లా
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు చెల్లించవలసిన ఆర్థిక పరమైన సమస్యలను పరిష్కరించాలి. ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. మా ఆర్థిక పరమైన విషయాల పరిష్కరణలో ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపడం కానీ, చర్యలు తీసుకుంటామని చెప్పడం లేదు. ఇవన్నీ తేలే వరకు ఉద్యమాలు కొనసాగుతాయి.
– రాళ్లపల్లి అబ్దుల్లా, ఫ్యాప్టో జనరల్ సెక్రటరీ, వైఎస్సార్జిల్లా.

పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం

పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం