
జగన్మాతా.. నమోస్తుతే!
దేవీ శరన్నవరాత్రుల వేడుకలు కన్నులపండువగా సాగుతున్నాయి. విద్యుద్దీప కాంతులతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ఆవరణలు కళకళలాడుతున్నాయి. బుధవారం ప్రొద్దుటూరులోని
అమ్మవారిశాల ఆలయంలో జగన్మాత
శారదాదేవిగా దర్శనమిచ్చారు. జిల్లాలోని మిగతా ఆలయాల్లోనూ అమ్మవారు వివిధ రూపాల్లో
భక్తులను కరుణించారు. – ప్రొద్దుటూరుకల్చరల్