భువనగిరిటౌన్ : సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జ్ అధికారి పి. సాహితి పేర్కొన్నారు. భువనగిరి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ జ్యోతిర్మయి, ఏఎస్డబ్ల్యూఓ సుమంత్, వార్డెన్లు శైలజ, ఆనంద్, సుని, విశ్వనాథం, సైదులు, జహంగీర్, ఉత్సవ కమిటీ సభ్యులు ఇటకాల దేవేందర్, సుపపంగశివలింగం, కర్తల శ్రీను, బట్టు రామచంద్రయ్య, బర్రె జహంగీర్, నర్సింహ, రవివర్ధన్, శంకర్, రామకృష్ణ, కుతడి సురేష్ పాల్గొన్నారు.


