స్కూల్‌ బస్సులకు ప్రాక్సిమిటీ మిర్రర్లు | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సులకు ప్రాక్సిమిటీ మిర్రర్లు

Sep 21 2025 5:38 AM | Updated on Sep 21 2025 5:38 AM

స్కూల్‌ బస్సులకు ప్రాక్సిమిటీ మిర్రర్లు

స్కూల్‌ బస్సులకు ప్రాక్సిమిటీ మిర్రర్లు

బస్సు 360 డిగ్రీల కోణంలో కనిపించేలా కుంభాకార దర్పణాలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో స్కూల్‌ బస్సుల ప్రమాదాలు ప్రజలను కలిచివేశాయి. పది రోజుల వ్యవధిలో స్కూల్‌ బస్సుల కింద పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటనలు తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చాయి. దీంతో ప్రమాదాల నివారణకు రవాణా శాఖ శ్రీకారం చుట్టింది. స్కూల్‌ బస్సులకు ప్రాక్సిమిటీ మిర్రర్లు (కుంభాకార దర్పణాలు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్కూల్‌ బస్సు 360 డిగ్రీల్లో కనిపించేలా అద్దాలు ఏర్పాటు చేసుకోవాలని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది.

బస్సు పూర్తిగా కనిపించేలా..

ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి స్కూల్‌ బస్‌కు కుడి, ఎడమ పక్కన, ముందుభాగం, వెనుక భాగం కనిపించేలా ప్రాక్సిమిటీ మిర్రర్లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. బస్సులకు ముందు భాగంగా సైడ్‌కు ఉండే ఈ అద్దాల్లో బస్‌కు ఉన్న చక్రాలు, బంపర్‌, రోడ్డు అంతా కనిపిస్తుంది. దాంతో అక్కడకు పిల్లలు వస్తే డ్రైవర్‌కు అద్దంలో చూస్తే కనిపిస్తుంది. డ్రైవింగ్‌ సీటుకు ముందు బస్‌ బయట నుంచి పెద్ద మిర్రర్‌ను ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా బస్‌ ముందు ఎవరైనా చిన్న పిల్లలు వెళ్లినా అద్దంలో నుంచి డ్రైవర్‌కు కనిపిస్తుంది.

తనిఖీలకు 13 బృందాలు

స్కూల్‌ బస్‌లను ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌తో పాటు మిర్రర్లు అన్ని సక్రమంగా ఉన్నాయా లేవా అనే విషయాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు రవాణ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిక్షణ కోసం వచ్చిన ఎంవీఐలు, స్థానిక రవాణా శాఖ సిబ్బందితో కలిపి 13 బృందాలను రవాణ శాఖ ఏర్పాటు చేసింది.

ఇటీవల నల్లగొండ జిల్లాలో స్కూల్‌

బస్సుల కింద పడి ఇద్దరు చిన్నారుల మృతి

ప్రమాదాల నివారణపై దృష్టి

సారించిన రవాణా శాఖ అధికారులు

నెల రోజుల్లోగా అద్దాలు ఏర్పాటు

చేసుకోవాలని యాజమాన్యాలకు ఆదేశం

తనిఖీలకు ప్రత్యేక బృందాలు

నెల రోజుల్లో ఏర్పాటు చేయాల్సిందే..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,649 స్కూల్‌ బస్సులు ఉండగా, అందులో కాలం చెల్లినవి, మరో ఒకటీ రెండు నెలల్లో కాలం చెల్లే బస్సులు, మూసివేసిన పాఠశాలలకు చెందినవి 54 ఉన్నాయి. వాటిని మినహాయించి మిగతా 1,595 స్కూల్‌ బస్‌లకు ప్రాక్సిమిటీ మిర్రర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో నల్లగొండ జిల్లాలో 699, సూర్యాపేట జిల్లాలో 522, యాదాద్రి జిల్లాలో 337 ఉన్నాయి. వీటికి నెల రోజుల్లోగా అద్దాలను బిగించాలని పాఠశాలల యజమానులకు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. రెండురోజుల కిందట సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు నల్లగొండ ఎంవీఐ లావణ్య తెలిపారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు సంఘటనల్లో ప్రమాదానికి కారణమైన బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఉన్నాయని వెల్లడించారు.

ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి

స్కూల్‌ బస్సుల వల్ల పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎంతో విలువైన పిల్లల ప్రాణాలను కాపాడేందుకు, ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేకంగా అద్దాలను బిగించేలా చర్యలు చేపడుతున్నాం. బస్సు చుట్టూ అన్ని వైపులా కనిపించేలా, పిల్లలు పూర్తిగా బస్సుకు దూరంగా వెళ్లారా? లేదా? అన్నది డ్రైవర్‌ ఆయా అద్దాల్లో చూసుకొని వెళ్లేలా చర్యలు చేపడుతున్నాం.

– వాణి, నల్లగొండ జిల్లా డిప్యూటీ

ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement