రాతి గోడలతో రాజకోట | - | Sakshi
Sakshi News home page

రాతి గోడలతో రాజకోట

Sep 15 2025 7:46 AM | Updated on Sep 15 2025 9:18 AM

రాతి గోడలతో రాజకోట

రాతి గోడలతో రాజకోట

రాజాపేట: రాజాపేట మండల కేంద్రంలో 250 ఏళ్ల క్రితం రాజుల కాలంలో నిర్మించిన రాజకోట ఇన్నేళ్లవుతున్నా చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. రాజరాయన్న 1775లో ఈ రాజకోటను రాతి గోడలతో నిర్మిచారు. అప్పటి నిజాం పాలకులు సంస్థాన్‌ నారాయణపురం, సంస్థాన్‌ రాజాపేట కోటను కేంద్రంగా ఏర్పాటు చేసుకుని పరిపాలించారు. ప్రజా పాలన కోసం తమ రక్షణ కోసం అప్పటి శాసీ్త్రయ పద్ధతిలో ఈ కోటను శత్రుదుర్భేధ్యంగా నిర్మించారు. ఇందుకు గాను డంగుసున్నంతో పెద్దపెద్ద రాళ్లతో కోటగోడలు నిర్మించారు. ఈ రాజకోట బురుజులు, ఎత్తైన ప్రాకారాలతో ఉంది. శత్రువులు రాకుండా కందకాల్లో మొసళ్లను పెంచేవిధంగా సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామం చుట్టూ ఒక పద్ధతిగా కందకాలను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement