
ఎయిమ్స్లో ఆత్మహత్య నివారణ వారోత్సవాలు
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో సైకియాట్రీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆత్మహత్య నివారణ వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చిన రోగులకు, వారి బంధువులకు ఆత్మహత్య నివారణపై నర్సింగ్ విద్యార్థులు అవగాహన కల్పించారు. అనంతరం ఓపీడీ బ్లాక్లో మానసిక ధైర్యం పెంపొందించుకునే విధంగా విద్యార్థులు పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతెం శాంతాసింగ్, డీన్ నితిన్ జాన్, మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా తదితరులు పాల్గొన్నారు.