
నీటి నిల్వ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి
మునుగోడు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నీటి నిల్వకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర జలవనరుల కమిటీ అధికారి ఆనంద్బాబు సూచించారు. సోమవారం మునుగోడు మండలంలోని కొరటికల్, గూడపూర్, సింగారం, జమస్తాన్పల్లి తదితర గ్రామాల్లో నీటి నిల్వ కోసం చేపట్టిన చెక్డ్యాంలు, పత్తి, ఊట కుంటలతో పాటు వరద కట్టల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో ఎక్కడెక్కడ ఎన్ని పనులు చేశారు, వాటికి ఎంత ఖర్చయ్యింది. వాటి వల్ల భూగర్భ జలాలు ఏమైనా పెరిగియా అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకు అడుగంటుతున్న భూగర్భజలాలను పెంచేందుకు వర్షపు నీరు వృథా కాకుండా భూమిలో ఇంకేలా చొరవ చూపాలని సూచించారు. ఆయన వెంట మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్, ఎంపీఓ స్వరూపరాణి, ఏపీఓ నాగరాజు, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, రైతులు ఉన్నారు.
కేంద్ర జలవనరుల కమిటీ అధికారి ఆనంద్బాబు