
సులభతరమైన మూల్యాంకనం చేయాలి
నల్లగొండ టూటౌన్ : యూనివర్సిటీల్లో అధ్యాపకులు పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా సులభతరమైన మూల్యాంకనం చేయాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూలో మంగళవారం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రిడిటేషన్ సంస్థ ఆధ్వర్యంలో అధ్యాపకులకు ఫలితాలు, మూల్యాంకనం మెళకువలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వీసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్రిడిటేషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ పి. రవీందర్రెడ్డి అధ్యాపకులకు మ్యాట్రిక్స్ వినియోగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల అంజిరెడ్డి, జయంతి, ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ్సాగర్, అరుణప్రియ, సుధారాణి, రమణారెడ్డి పాల్గొన్నారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ
వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్