
మేకలు చోరీ చేస్తున్న నిందితుల అరెస్ట్
కొండమల్లేపల్లి: మేకలు చోరీ చేస్తున్న నలుగురు నిందితులను కొండమల్లేపల్లి పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఇన్చార్జి సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలం మేగ్యతండాకు చెందిన ఆంగోతు గోపిచంద్, హైదరాబాద్లోని కర్మన్ఘట్కు చెందిన పొడిపాటి స్టాలిన్ అలియాస్ సాయిచరణ్, చింతపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన ఉడుత శివ, మరో బాలుడు కలిసి ఈ నెల 6వ తేదీన కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ఓ మేకల షెడ్లో పది మేకలను అపహరించారు. మేకల షెడ్ యజమాని ఫిర్యాదు మేరకు కొండమల్లేపల్లి ఎస్ఐ అజ్మీర రమేష్ కేసు నమోదు చేశారు. మంగళవారం కొండమల్లేపల్లి పట్టణంలోని చౌరస్తాలో అనుమానంగా తిరుగుతున్న నలుగురిని పోలీసులు పట్టుకుని విచారించగా.. నిజం ఒప్పుకున్నారు. వీరిపై నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి 2 కేసులు, గుర్రంపోడులో ఒక కేసు ఉన్నట్లు సీఐ తెలిపారు. వారి నుంచి రూ.2.20లక్షల నగదు స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
యాదగిరీశుడి సేవలో బీసీ కమిషన్ చైర్మన్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు.