
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల పిల్లలు
పెన్పహాడ్ : తాము విధులు నిర్వహిస్తున్న పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు. పెన్పహాడ్ మండలం చీదెళ్ల ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న కొప్పుల శోభ తన చిన్న కుమారుడు సిద్దార్ధ ఆర్యన్రెడ్డిని అదే పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించింది. శోభ భర్త పరెడ్డి వీరారెడ్డి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే కావడం విశేషం. అదేవిధంగా చెట్లముకుందాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న వేల్పుల జాకోబు రాజకుమార్ తన కుమార్తెను ఎలిజబెత్ అమూల్యను అదే పాఠశాలలో 3వ తరగతిలో చేర్పించారు.
కుమారులిద్దరు సర్కారు బడికే..
రాజాపేట : రాజాపేట మండలంలోని సింగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న చిలివేరు సుప్రియ తన ఇద్దరు కుమారులు విశాల్, వివేక్ను మంగళవారం రఘునాథపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. సుప్రియన కుటంబంతో కలిసి రఘునాథపురం గ్రామంలోనే నివాసముంటోంది. ఆమె కుమారులు గతంలో భువనగిరిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదవగా.. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది. మండల విద్యాధికారి చందా రమేష్, ప్రధానోపాధ్యాయులు మనోజ్కుమార్ సుప్రియను, ఆమె భర్త రమేష్ను అభినందించారు.
ఇద్దరు కుమార్తెలు తన వెంటే..
తుంగతుర్తి: మండల పరిధిలోని వెంపటి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్లెపాక రవీందర్ తన ఇద్దరు కుమార్తెలకు తాను చదువు చెప్పే పాఠశాలలోనే అడ్మిషన్ తీసుకున్నారు. పెద్ద కూతురు మాన్విజ్ఞను రెండేళ్ల క్రితమే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించగా.. ఆమె ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ చదువుతోంది. రెండో కుమార్తె అద్విత కోసం అదే పాఠశాలలో మంగళవారం ప్రధానోపాధ్యాయురాలు వెంకటరామనరసమ్మ వద్ద అడ్మిషన్ తీసుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల పిల్లలు

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల పిల్లలు

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల పిల్లలు