
సమష్టి కృషితోనే లాభాల బాట
నల్లగొండ అగ్రికల్చర్: పాలకవర్గం, సహకార సంఘాల చైర్మన్లు, ఉద్యోగుల సమష్టి కృషితోనే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) లాభాల బాటలో పయనిస్తోందని ఆ బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని డీసీసీబీ కార్యాలయంలో జరిగిన మహాజన సభలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.2,850.81 కోట్ల టర్నోవర్కు చేరుకుని రూ.42.31కోట్ల గ్రాస్ ప్రాఫిట్, రూ.26.97కోట్ల నెట్ ప్రాఫిట్ను సాధించిందన్నారు. రుణం పొందిన వ్యక్తులు ఏదేని కారణంతో చనిపోతే వారి కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ఓటీఎస్ విధానం అమలు చేస్తున్నామన్నారు. సహకార సంఘాలకు నాబార్డు రీ ఫైనాన్స్ ద్వారా కిసాన్ డ్రోన్లు అమలు చేయనున్నామన్నారు. నేషనల్ లైవ్స్టాక్ మిషన్ ద్వారా రైతులు కోళ్లు, కోళ్ల ఫారాలు, పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు అందిస్తున్నామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాల కోసం తక్కువ వడ్డీతో గరిష్టంగా రూ.35లక్షల వరకు రుణం ఇచ్చేలా కొత్త పాలసీ తీసుకొచ్చామన్నారు. ఇప్పటి వరకు 116మంది రైతులకు రూ.17 కోట్లు రుణాలు అందించామన్నారు. బంగారు ఆభరణాలపై రూ. 623.92 కోట్ల రుణాలను అందించామన్నారు. డిపాజిట్ల సేకరణ లక్ష్యాన్ని త్వరలో పూర్తిచేస్తామన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్రెడ్డి, డైరెక్టర్లు గొంగిడి మహేందర్రెడ్డి, పాశం సంపత్రెడ్డి, గుడిపాటి సైదులు, ధనావత్ జయరామ్, అందెల లింగంయాదవ్, కోడి సుష్మ, ప్రవీణ్రెడ్డి, దొండపాటి అప్పిరెడ్డి, రంగాచారి, బంటు శ్రీనివాస్, కొండ సైదయ్య, రామచంద్రయ్య, సీఈఓ రావులపాటి శంకర్రావు పాల్గొన్నారు.
డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి