
మెరుగైన బోధనకు కార్యాచరణ
ఫ ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇచ్చాం
ఫ ప్రారంభం నుంచే ప్రతి విద్యార్థిపై శ్రద్ధ
ఫ నిరంతర పర్యవేక్షణకు తరగతులు,
పాఠశాలలవారీగా వాట్సాప్ గ్రూప్లు
ఫ టెన్త్ ఫలితాలతో సర్కారు స్కూళ్లపై నమ్మకం పెరిగింది
ఫ స్వచ్ఛందంగా బడిలో చేరుతున్నారు
‘సాక్షి’తో డీఈఓ
కందుల సత్యనారాయణ
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. పదో తరగతిలో సాధించిన ఫలితాలతో అంతటా ప్రభుత్వ స్కూళ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. తల్లిదండ్రులు స్వచ్ఛందంగా వచ్చి తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ఇంకా మెరుగైన బోధనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమయ్యేలా పాటించాల్సిన బోధన పద్ధతులపై ఇటీవల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. నిరంతర పర్యవేక్షణకు పాఠశాలల వారీగా వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. అని జిల్లా విద్యాశాఖాధికారి కందుల సత్యనారాయణ తెలిపారు. గురువారం నుంచి నూతన పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంతో ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. –సాక్షి యాదాద్రి
సులువైన పద్ధతుల్లో బోధన
విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధన చేసేందుకు ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇచ్చాం. ప్రతి విద్యార్థిపై ప్రారంభం నుంచే శ్రద్ధ వహిస్తాం. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చేలా తీర్చిదిద్దుతాం. చాలా మంది విద్యార్థులు గణితం విషయంలో వెనుకబడుతుంటారు. ఆ సమస్య లేకుండా బోధన ఉంటుంది.

మెరుగైన బోధనకు కార్యాచరణ