విద్యారు్థల్లారా.. స్వాగతం | - | Sakshi
Sakshi News home page

విద్యారు్థల్లారా.. స్వాగతం

Jun 12 2025 2:55 AM | Updated on Jun 12 2025 2:55 AM

విద్య

విద్యారు్థల్లారా.. స్వాగతం

నేటి నుంచి పాఠశాలలు

పునఃప్రారంభం

మామిడి తోరణాలు, ముగ్గులతో అలంకరణ

విద్యార్థులకు పూలు అందజేసి

స్వాగతించనున్న ఉపాధ్యాయులు

మొదటి రోజే పాఠ్య, నోట్‌ పుస్తకాలు, యూనిఫాం పంపిణీ

సాక్షి,యాదాద్రి : వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. సెలవుల్లో ఆట, పాటలతో గడిపిన విద్యార్థులు పుస్తకాలు చేతపట్టి పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అన్ని పాఠశాలల్లో పునఃప్రారంభాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మామిడి తోరణాలు, ముగ్గులతో అలంకరించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలు అందజేసి స్వాగతించనున్నారు.

మౌలిక వసతుల కల్పన

పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో పరిశుభ్రతపై అధికారులు దృష్టి సారించారు. పిచ్చిమొక్కలు, చెత్తచెదారాన్ని మున్సిపల్‌ సిబ్బందితో తొలగించారు. టాయిలెట్లను శుభ్రం చేసి, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. తాగునీరు, విద్యుత్‌ వంటి సౌకర్యాలు కల్పించారు. పలు చోట్ల పాఠశాల భవనాలకు రంగులు వేసి ముస్తాబు చేశారు.

పుస్తకాలు, యూనిఫాం సిద్ధం

పాఠశాలల ప్రారంభం రోజునే పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, యూనిఫాం అందజేయనున్నారు. జిల్లాలో 754 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో సుమారు 53 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం యూనిఫాం 43,506 జతలు, పాఠ్య పుస్తకాలు 43,506, నోట్‌ బుక్స్‌ 2,17,530 సిద్ధం చేశారు.

పాఠశాలలు, విద్యార్థుల వివరాలు

పాఠశాల సంఖ్య బాలురు బాలికలు

ప్రభుత్వ, జెడ్పీ 715 18,308 17,274

కేజీబీవీ 11 -- 2,812

మోడల్‌ స్కూల్స్‌ 07 1,662 2487

యూఆర్‌ఎస్‌ 01 74 --

టీజీ రెసిడెన్షియల్‌ 03 941 1,226

ఎస్‌డబ్ల్యూ రెసిడెన్షియల్‌ 07 1,532 2,476

ట్రైబల్‌ వెల్పేర్‌ రెసిడెన్షియల్‌ 01 250 0

ఆశ్రమ్‌ రెసిడెన్షియల్‌ 01 -- 129

బీసీ రెసిడెన్షియల్‌ 05 805 1,480

మైనార్టీ రెసిడెన్షియల్‌ 03 648 310

విద్యారు్థల్లారా.. స్వాగతం1
1/1

విద్యారు్థల్లారా.. స్వాగతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement