
అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ
భువనగిరిటౌన్ : అంగన్వాడీ కేంద్రాలు ఎగ్ బిర్యానీ తో ఘుమఘుమలాడాయి. ప్రభుత్వ ఆదేశాల మే రకు జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో బుధవారం ఎగ్ బిర్యానీ అందజేసే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. వారానికి రెండుసార్లు అందించనున్నారు.
విద్య, ఆరోగ్య భద్రత
అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా విద్య, ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమివ్వాలని.. ఇందుకోసం మంచి పౌష్టికాహారం అందజేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో లబ్ధిదారులకు వారంలో రెండుసార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూలో మార్పులు చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పండుగ వాతావరణంలో ఎగ్ బిర్యానీ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 901 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో చిన్నారులు 41,513, గర్భి ణులు 4,288, బాలింతలు 3,204మంది ఉన్నారు. తొ లిరోజు 11,224 మంది హాజరయ్యారు.
సద్వినియోగం చేసుకోవాలి
అంగన్వాడీ కేంద్రాల్లో ఇక నుంచి వారానికి రెండుసార్లు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఎగ్ బిర్యాని అందజేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు తెలిపారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు ఎగ్ బిర్యానీ వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్య, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, అందులో భాగంగానే అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసే చర్యలు చేపట్టిందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వవిద్యతో పాటు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నారులను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు. అంతకుముందు అమ్మ మాట–అంగన్వాడీ బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ శాగంటి శైలజ, సూపర్వైజర్ ఉమ, అంగ న్వాడీ టీచర్లు శైలజ, సరళ, లుద్దిమేరీ తదితరులు పాల్గొన్నారు.
ఫ వారానికి రెండు సార్లు
ఫ చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహారలోపం ఏర్పడకుండాజాగ్రత్తలు
ఫ 901 కేంద్రాల్లో ప్రారంభించిన అధికారులు

అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ