విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి
భీమవరం: భీమవరం ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్ కళాశాలల క్రీడా పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. జైత్ర 2026 పేరిట నిర్వహిస్తున్న స్పోర్ట్స్ కార్నివాల్కు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తే విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుందని అన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత్వర్మ మాట్లాడుతూ ఈ పోటీల్లో పలు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో 100 టీంలు పాల్గొంటున్నాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దిలీప్ చక్రవర్తి, ఫిజికల్ డైరెక్టర్ పి సత్యనారాయణరాజు, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ సీహెచ్ హరిమోహన్, జి సారిక తదితరులు పాల్గొన్నారు.
మొదటిరోజు విజేతల వివరాలు
ఉమెన్ వాలీబాల్: భీమవరం ఎస్ఆర్కెఆర్, ఏలూరు సీఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, గుంటూరు సెయింట్ మేరీస్ జట్లపై విష్ణు ఇంజనీరింగ్ కళాశాల టీం విజయం సాధించింది. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలపై చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల విజయం సాధించింది.
మెన్ వాలీబాల్ విభాగంలో: కేఎల్యు జట్టుపై ఒంగోలు క్విజ్ ఇంజనీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది. చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల జట్టుపై విజ్ఞాన్ యూనివర్సిటీ జట్టు గెలుపొందింది. భీమవరం బీవీఐటీ జట్టుపై నరసాపురం స్వర్ణాంధ్ర జట్టు విజయం సాధించింది.
కబడ్డీ మెన్ విభాగంలో: అమలాపురం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలపై గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీ గెలుపొందింది. అనంతపురం శ్రీవెంకటేశ్వర కళాశాల జట్టుపై ఎస్ఆర్ఎం అమరావతి విజయం సాధించింది. అలాగే ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల జట్టుపై భీమవరం ఎస్ఆర్కేఆర్–2 జట్టు గెలుపొందింది. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాల ఎస్ఆర్కేఆర్ కళాశాల వన్ జట్టుపై విజయం సాధించింది.
బ్యాడ్మింటన్ విభాగంలో: ఒంగోలు కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల, నంబూర్ వీవీఐటీ కళాశాల, అమలాపురం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల, ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల, నరసరావుపేట తిరుమల ఇంజనీరింగ్ కళాశాల, భీమవరం డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాల, నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల, జేఎన్టీయూకే ఇంజనీరింగ్ జట్లు విజయాలు సాధించాయి.


