
సమస్యలతో సీహెచ్ఓల సతమతం
పెంటపాడు: నేషనల్ హెల్త్మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ)లు సమస్యలతో సతమతమవుతున్నారు. గ్రామీణ స్థాయిలో సేవలందిస్తున్న వీరు ఉద్యోగ భద్రత లేక, సకాలంలో జీతాలు అందక, సరైన గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 368 సీహెచ్ఓలు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 14 రకాల ఆరోగ్య సేవలను వీరు అందిస్తున్నారు. మలేరియా, డెంగీ నివారణకు కృషి చేయడంతో పాటు గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య జాగ్రత్తలు వివరిస్తున్నారు. అలాగే ప్రభుత్వం ద్వారా ఆరోగ్య సర్వే, ఫ్యామిలీ హెల్త్ సేవలు, ఇంటింటికీ సేవలు అందిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వీరంతా జిల్లాకేంద్రాల్లో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ప్రధానంగా వీరికి మూడు నెలలుగా ఇన్సెంటివ్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
సీహెచ్ఓల డిమాండ్లు
● ఆరేళ్లు పూర్తయిన సీహెచ్ఓల సర్వీసులను క్రమబద్ధీకరించాలి.
● ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి.
● ఏటా 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి
● జీతాలతో పాటు ఇన్సెంటివ్లు అందించాలి.
● గ్రామాల్లో ప్రభుత్వ క్లినిక్ల అద్దెలను సకాలంలో చెల్లించాలి.
ఉద్యోగ భద్రత కరువు
మూడు నెలలుగా ఇన్సెంటివ్ బకాయిలు
నిరవధిక సమ్మెకు సన్నద్ధం