
24 నుంచి జాతీయ స్థాయి నాటిక పోటీలు
భీమవరం: పట్టణంలోని చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ నుంచి 18వ జాతీయస్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు చైతన్య భారతి వ్యవస్థాపక అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ చెప్పారు. సోమవారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో నాటిక పోటీల వివరాలను వెల్లడించారు. పట్టణంలోని డీఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై నాలుగు రోజులుపాటు నాటిక పోటీలు నిర్వహిస్తామన్నారు. 24న ఉషోదయ కళానినేతన్ కట్రపాడు వారి శ్రీకిడ్నాప్ఙ్, మైత్రి కళానిలయం హైదరాబాద్ వారి ‘బ్రహ్మ స్వరూపం్ఙ, 25న యువభేరీ థియేటర్ ఆర్గనైజేషన్ వారి ‘నా శత్రువు’, అమరావతి ఆర్ట్స్ వారి ‘ చిగురు మేఘంశ్రీ, మద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్స్ చిలకలూరిపేట వారి ‘మా ఇంట్లో మహాభారతం’, 26న మహతి క్రియేషన్ హైదరాబాద్ వారి ‘ఉక్కు సంకెళ్ళు’, చైతన్య కళా స్రవంతి విశాఖ వారి ‘(అ) సత్యం’, మిత్రా క్రియేషన్ హైదరాబాద్ వారి ‘ఇది రహదారి కాదు’ నాటికల ప్రదర్శన ఉంటుంది. 27న అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి ‘విడాకులు కావాలి’, సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి ‘జనరల్ బోగీలు’ నాటికలను ప్రదర్శిస్తారని భగవాన్ వివరించారు. అలాగే కళాకారులకు పురస్కారాలు అందిస్తామన్నారు. విలేకర్ల సమావేశంలో నాటక పరిషత్ కార్యదర్శి మంతెన రామకుమార్రాజు, పీఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు, కోశాధికారి బొండా రాంబాబు, వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, పేరిచర్ల లక్ష్మణవర్మ, వడుపు గోపి, కట్రెడ్డి సత్యనారాయణ, నడింపల్లి మహేష్, పెన్నాడ శ్రీను, చెరుకుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. నాటిక పోటీల ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు హాజరవుతారని భగవాన్ తెలిపారు.
విద్యుత్ సంస్థల ఉద్యోగులకు
పెన్షన్, జీపీఎఫ్ కల్పించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యుత్ సంస్థల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా పెన్షన్, జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని విద్యుత్ ఉద్యోగుల జీపీఎఫ్ సాధన సమితి ఉమ్మడి డిమాండ్ చేసింది. ఈమేరకు జిల్లా పర్యటనకు సోమవారం సాయంత్రం నగరానికి వచ్చిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ను సంఘ అధ్యక్షుడు పీ శ్రీనివాస్, కన్వీనర్ కే కృష్ణకుమార్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్, 1980 ని సవరించి 2004 సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర – ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును అమలులోకి తెచ్చినా విద్యుత్ ఉద్యోగులు మాత్రం జీపీఎఫ్ పరిధిలోనే ఉన్నారన్నారు. దీనివల్ల 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగష్టు 31 మధ్య ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో నియమతులైన సుమారు 6,200 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అంతే కాకుండా, ఉద్యోగ నిర్వహణలో భాగంగా ప్రమాదాలకు గురై మరణించిన ఉద్యోగుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో వీధిన పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ప్రకారం పెన్షన్ సౌకర్యం, జీపీఎఫ్ సౌకర్యం విద్యుత్ ఉద్యోగులకు అందరికీ కల్పించాలని మంత్రిని కోరారు.
ముగ్గురు రైల్వే ఉద్యోగులకు జీఎం సేఫ్టీ అవార్డులు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్ల నిర్వహణలో లోపాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్కు చెందిన ముగ్గురు ఉద్యోగులు శ్రీజీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డును అందుకున్నారు. సోమవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్తో పాటుగా సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎంలతో వర్చువల్ పద్ధతిలో భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన దెందులూరు ఆపరేటింగ్ విభాగంలోని స్టేషన్ సూపరింటెండెంట్ టీవీఎంయూ మహేశ్వర్, రాజమండ్రి ఆపరేటింగ్ విభాగంలోని పాయింట్ మెన్ కె.నథానియేల్, రాజమండ్రిలోని ట్రైన్ మేనేజర్ లోకేష్కుమార్లకు జీఎం అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు.
నాగులదేవునిపాడులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు
దెందులూరు: గాలాయిగూడెం పంచాయతీ నాగులదేవునిపాడు గ్రామంలో ఇరుకుటుంబాల మధ్య ఏర్పడిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్సై ఆర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి మురుగునీటి విషయంలో రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణకు దారితీసిందన్నారు. గుజ్జుల నాగేంద్రబాబు చాకుతో గూడపాటి చందు, గూడపాటి జోషిలపై దాడికి పాల్పడగా.. జోషి కుమారుడు సుమంత్ రాయితో గుజ్జుల నాగేంద్రబాబుపై దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించమన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివాజీ తెలిపారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
పెదపాడు: ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందిన ఘటన పెదపాడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎద్దు వేదప్రకాష్ (38) తన స్థలంలో ఇంటి నిర్మాణానికి వాటరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్కు గురై మృతి చెందాడు. వేదప్రకాష్ మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రకాష్కు భార్య ఒక పాప ఉన్నారు. ఫార్మసీ చదివిన ప్రకాష్ వైద్యురాలు అయిన భార్యతో కలిసి హెల్త్ క్లినిక్ నిర్వహిస్తున్నారు.

24 నుంచి జాతీయ స్థాయి నాటిక పోటీలు