అదనపు కలెక్టర్ ఎన్.రవి
హన్మకొండ అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రవి అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్, రెవెన్యూ, హౌసింగ్, పౌరసరఫరాలు తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 162 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ట్రెయినీ ఐఏఎస్ సాయి శివాని, డీఆర్ఓ సత్యపాల్రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రమేశ్, నారాయణ, డీఆర్డీఓ శ్రీను పాల్గొన్నారు.


