‘టెక్స్‌టైల్‌’ పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘టెక్స్‌టైల్‌’ పనులు వేగవంతం చేయాలి

Oct 7 2025 4:07 AM | Updated on Oct 7 2025 4:07 AM

‘టెక్స్‌టైల్‌’ పనులు వేగవంతం చేయాలి

‘టెక్స్‌టైల్‌’ పనులు వేగవంతం చేయాలి

‘టెక్స్‌టైల్‌’ పనులు వేగవంతం చేయాలి

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు పనులను వేగవంతం చేయాలని అధికారులను వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌ చాంబర్‌లో సోమవారం డీఎఫ్‌ఓ అనూజ్‌ అగర్వాల్‌, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మితో కలిసి కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులోని గ్రీన్‌ కవరింగ్‌, ఆర్‌ఓబీ, కుడా లేఅవుట్‌, డ్రెయినేజీ, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్‌ వాటర్‌ తదితర పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పార్కులో 12వేల ప్లాంటేషన్‌ పనులను 15రోజుల్లో పూర్తి చేయాలని హర్టికల్చర్‌ అధికారిని ఆదేశించారు. సమావేశంలో ఇండస్ట్రియల్‌ జోనల్‌ మేనేజర్‌ స్వామి, కుడా చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ అజిత్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ గౌతంరెడ్డి, మిషన్‌ భగీరథ ఈఈ మాణిక్యరావు, ఆర్‌అండ్‌బీ డీఈ దేవిక, తహసీల్దార్లు రియాజుద్దీన్‌, రాజ్‌కుమార్‌, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

అధికారులు చర్యలు తీసుకోవాలి

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా నోడల్‌ అధికారులు ప్రణాళికాబద్ధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల నేపథ్యంలో నోడల్‌ అధికారులతో కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణితో కలిసి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేటాయించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement