
మహా దుర్గ అలంకరణలో భ్రమరాంబిక
ఐనవోలు: దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా ఎనిమిదో రోజు సోమవారం మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామి ఆలయంలో భ్రమరాంబిక అమ్మవారు మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రాతఃకాల అర్చన, త్రిపురోపనిషత్, దేవ్యుపనిషత్ పారాయణాలు, ఆవరణ పూజ, సువాసిని పూజ, నిత్యాహ్నికం, శ్రీ సూక్తపారాయణం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.