స్కందమాత అలంకరణలో భ్రమరాంబిక | - | Sakshi
Sakshi News home page

స్కందమాత అలంకరణలో భ్రమరాంబిక

Sep 27 2025 4:26 AM | Updated on Sep 27 2025 4:26 AM

స్కందమాత అలంకరణలో భ్రమరాంబిక

స్కందమాత అలంకరణలో భ్రమరాంబిక

స్కందమాత అలంకరణలో భ్రమరాంబిక

ఐనవోలు: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో భ్రమరాంబిక అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా ఆలయంలో నిత్యాహ్నికం, నవావర్ణ అర్చన, భావనోపనిషత్‌ పారాయణం, చండీ సప్తశతి పారాయణం, చండీ హవనం విశేషంగా నిర్వహించారు. మహా నివేదన, నీరాజన మంత్ర పుష్పం తదితర కార్యక్రమాలతో ఐదో రోజు కార్యక్రమాలు ముగించారు. అమ్మవారి విశేష అలంకారాలను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్‌ కోరారు. చండీహామంలో ఈఓ కందుల సుధాకర్‌, సూపరిండెంట్‌ అద్దంకి కిరణ్‌కుమార్‌ దంపతులు, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్‌, ఐనవోలు మధుకర్‌ శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్‌ వినాయక్‌ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్‌, మధు శర్మ, శ్రీనివాస్‌, నరేష్‌శర్మ, దేవేందర్‌, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement