కీర్తినగర్ నుంచి రెడ్డిపాలెం వెళ్లే దారి
గ్రేటర్ వరంగల్ పరిధిలో నెలకొల్పిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు చెరువుల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, ఆ చెరువులకు వెళ్లేదారులు ఇటీవల కురిసిన వర్షాలకు ఛిద్రమయ్యాయి. చిన్నవడ్డేపల్లి చెరువు, బంధం చెరువు, ఉర్సు రంగసముద్రం, ఖిలా వరంగల్ అగర్తల, హసన్పర్తి, సిద్దేశ్వర గుండం తదితర ప్రాంతాలకు వెళ్లే రోడ్లు గుంతలు గి మారాయి. ఈ రోడ్లగుండా వినాయక నిమజ్జన శోభాయాత్ర వాహనాలు దిగబడే ప్రమాదం ఉంది. బల్దియా అధికారులు స్పందించి ఆయా రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని భక్తులు కోరుతున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు,
హన్మకొండ/వరంగల్
నిమజ్జనానికి ‘దారి’ చూపండి
నిమజ్జనానికి ‘దారి’ చూపండి
నిమజ్జనానికి ‘దారి’ చూపండి