
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : కలెక్టర్ సత్యశా
వర్ధన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన వసతులతోపాటు నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ సత్యశారద తెలిపారు. మండలంలోని ల్యాబర్తి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించిన ందుకు విద్యార్థులు, ఉపాధ్యాయలను అభినందించారు. ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు చదువుతోపాటు స్కిల్ డెవలప్మెంట్ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, వర్ధన్నపేట తహసీల్దార్ విద్యాసాగర్, ఎంఈఓ శ్రీధర్, ఎంపీడీఓ అరుంధతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బడిబాటను విజయవంతం చేయాలి
ఖిలా వరంగల్: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఖిలా వరంగల్ మండల పరిధి గుంటూరుపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సత్యశారద, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులకు యూనిఫామ్, బుక్స్ పంపిణీ చేసి మాట్లాడారు. ఈనెల 6వ తేదీ నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల పునఃప్రారంభమైన సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఐదు సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని, బడిబయట ఉన్న విద్యార్థులను గుర్తించి తిరిగి బడికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అంతకుముందు నూతనంగా బడిలో చేరిన విద్యార్థులకు అడ్మిషన్ ఫారాలు అందించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఓ రమేశ్, ఎస్సైలు శ్రీకాంత్, కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.