దుగ్గొండి: ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంతో రైతుల భూముల సమస్యలు పరిష్కారమవుతాయని నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి అన్నారు. మండలంలోని ముద్దునూరు, పోలారం గ్రామాల్లో గురువారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్దునూరు రెవెన్యూ సదస్సును ఆర్డీఓ ఉమారాణి పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సాదాబైనామా, ఆర్ఓఆర్లో తప్పులు సరిచేయడం, సర్వేనంబర్ మిస్సింగ్ లాంటి సమస్యలు పరిష్కరించనున్నట్లు ఆమె తెలిపారు. తహసీల్దార్ రాజేశ్వర్రావు, డీటీ ఉమ, ఆర్ఐలు రాంబాబు, మల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
సంగెం: సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈస్ట్జోన్ డీసీసీ అంకిత్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను గురువారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. డీసీపీ వెంట మామునూరు ఏసీపీ వెంకటేశ్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్ ఉన్నారు.
నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
నర్సంపేట: నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ఫో ర్స్ పోలీసులు పట్టుకున్న సంఘటన చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నూనె స్వామి బీజీ త్రీ బీటీ నకిలీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నాడు. కిలోకు రూ.మూడు వేల చొప్పున గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు 14 కిలోల వరకు విత్తనాలు విక్రయించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసి నాలుగు కిలోల విత్తనాలను అతడి నుంచి స్వాధీనం చేసుకుని చెన్నారావుపేట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు మండల వ్యవసాయ అధికారి గోపాల్రెడ్డి ఫిర్యాదు మేరకు నూనె స్వామిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నారావుపేట ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు.
అంగన్వాడీలు మెరుగైన సేవలందించాలి
వర్ధన్నపేట: చిన్నారుల బంగారు భవిష్యత్కు అంగవాడీ కేంద్రాలే పునాదులని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేటలోని ఫిరంగిగడ్డ అంగన్వాడీ కేంద్రంలో గురువారం అమ్మ మాట–అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులకు మెరుగైన సేవలందించాలని కార్యకర్తలను సూచించారు. అంగన్వాడీల్లో చేరిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించేలా చూడాలని అధికారులు, తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రాజమణి, వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, వర్ధన్నపేట సీడీపీఓ దేహోర తదితరులు పాల్గొన్నారు.
నేటినుంచి జాతీయ వర్క్షాప్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో జూవాలజీ విభాగం ఆధ్వర్యాన ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం అఽధిపతి ఆచార్య జి.షమిత తెలిపారు. ‘హ్యాండ్ ఆన్ మాలిక్యూలర్ డాకింగ్ అండ్ డ్రగ్ డిస్కవరీ టెక్నిక్స్’ అనే అంశంపై జువాలజీ సెమినార్ హాల్లో నిర్వహించే ఈ వర్క్షాప్ ప్రారంభం సమావేశంలో కేయూ వీసీ ప్రతాప్రెడ్డితోపాటు సైన్స్ డీన్ జి.హనుమంతు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మామి డాల ఇస్తారి, కన్వీనర్ వై.వెంకయ్య, బీఓఎస్ ఈసం నారాయణ పాల్గొంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

భూభారతి చట్టంతో భూసమస్యల పరిష్కారం