
సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు
● పాలిటెక్నిక్ కళాశాల
ప్రిన్సిపాల్ ప్రభాకర్
రామన్నపేట: విద్యార్థులు, అధ్యాపకుల సమష్టి కృషితో టీజీఈసెట్లో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ అన్నారు. గురువారం కళాశాల ఆవరణలో టీజీఈసెట్–2025లో ఉత్తమ ప్రతిభ కబర్చి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులను ప్రిన్సిపాల్తోపాటు అధ్యాపక బృందం అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం కళాశాలకు ఎంతో గర్వకారణమని, ఈ స్ఫూర్తిదాయక ప్రదర్శన ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. భవిష్యత్లో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.