
సర్కారు స్కూళ్లను బలోపేతం చేయాలి
● జిల్లా అకడమిక్ మానిటరింగ్
అధికారి సుజన్తేజ
గీసుకొండ/నర్సంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థులను చేర్పిస్తే బంగారు భవిష్యత్ ఉంటుందని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) సుజన్తేజ అన్నారు. గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి, చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో పొదుపు సంఘాల మహిళలతో గురువా రం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని సూచించారు. గంగదేవిపల్లి పాఠశాల హెచ్ఎం అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ పదో తరగతిలో విద్యా ర్థులు అత్యధిక మార్కులు సాధించారని పేర్కొన్నా రు. అదేవిధంగా చెన్నారావుపేటలో జరిగిన బడిబాట కార్యక్రమంలో ఏఎంఓ సుజన్తేజ, మండల విద్యాశాఖ అధికారి బైరి సరళ, మండల ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు. ఎమ్మార్సీ కార్యాలయంలో పాఠ్యపుస్తకాలు, రికార్డులను పరిశీలించారు.